ప్రత్యేకంహోమ్

ఇరాన్ పై పాశవిక దాడి: 25 మంది పౌరులు మృతి

#IranWar

ఇరాన్ పై అమెరికా జరిపిన దాడుల్లో ఒక్క రోజులో 25 మంది మరణించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో రాత్రంతా పేలుళ్లు చోటుచేసుకోగా, యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో ఎగిరిన శబ్దాలు గంటల పాటు వినిపించాయి. ఈ దాడులతో నగరంలో భయాందోళన వాతావరణం నెలకొంది.

ఈ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ అరబ్ దేశాలపై కూడా ఇరాన్ క్షిపణి దాడులు ప్రారంభించింది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి అంశం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఈ కీలక సముద్ర మార్గాన్ని తిరిగి తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గడువు విధించడంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది.

ఇదిలా ఉండగా, ఈ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై కనిపించింది. ప్రపంచ చమురు ధరలు కొంత అస్థిరంగా మారాయి. బ్రెంట్ చమురు ధర బ్యారెల్‌కు 109.79 డాలర్లకు చేరగా, అమెరికా డబ్ల్యుటిఐ చమురు ధర 111.01 డాలర్ల వద్ద ట్రేడింగ్ అయ్యింది. గత వారం భారీగా పెరిగిన ధరల తర్వాత, ప్రస్తుతం పెట్టుబడిదారులు అమెరికా-ఇరాన్ చర్చలపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.

హోర్ముజ్ జలసంధిలో రవాణా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళనలతో ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లలో మరింత అస్థిరత పెరిగే అవకాశం ఉంది.

Related posts

ఖమ్మం ఉమ్మడి జిల్లాకు గోదావరి జలాలే లక్ష్యం

Satyam News

దళపతి విజయ్ కు కాంగ్రెస్ మద్దతు

Satyam News

హోర్ముజ్ జలసంధిని తెరిచేశాం: డోనాల్డ్ ట్రంప్

Satyam News

అమెరికా ఇరాన్ అవగాహనను స్వాగతించిన భారత్

Satyam News

సజ్జనార్ వార్నింగ్తో భయపడ్డ యూట్యూబర్లు

Satyam News

తిరుపతి షిర్డీ మధ్యన వారాంతపు ఎక్స్ ప్రెస్ రైలు

Satyam News

Leave a Comment