జాతీయంహోమ్

పేపర్ లీక్ ఘటనలపై ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు

#Modi

నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై పెట్టిన కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో త్వరగా పరిష్కరిస్తామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనల్లో నిందితులకు వేగంగా శిక్షలు పడేలా కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ న్యాయస్థానాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దేశ యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమ వేదికలో చేసిన పోస్టులో ప్రధానమంత్రి మాట్లాడుతూ, ప్రశ్నపత్రాల లీకేజీ వంటి ఘటనలను కట్టడి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలు, అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కాపాడుతూ విద్యార్థుల ప్రయోజనాలను రక్షించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

దేశ యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడే వారిపై ఎలాంటి కనికరం ఉండదని మోదీ హెచ్చరించారు. ప్రశ్నపత్రాల లీకేజీలకు పాల్పడే వ్యక్తులను కఠినంగా శిక్షించేలా వేగవంతమైన విచారణ నిర్వహించేందుకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ న్యాయస్థానాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

పరీక్షల వ్యవస్థపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడం, నిందితులకు త్వరితగతిన శిక్షలు విధించడం ద్వారా ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

Related posts

పెంచలయ్య కుటుంబానికి అండగా కోటంరెడ్డి

Satyam News

దక్షిణ్ ఎనర్జీ ప్రమాద బాధితులకు న్యాయం చేస్తాం

Satyam News

నర్సింగ్ ఆఫీసర్లకు ఇండక్షన్ శిక్షణ కార్యక్రమం

Satyam News

బందరు పోర్టు కు ఇప్పుడు ‘చంద్ర’ కళ

Satyam News

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే

Satyam News

ప్రశ్నాపత్రాల లీకేజీలపై మరిన్న కఠిన చర్యలు

Satyam News

Leave a Comment