22.7 C
Hyderabad
July 7, 2024 06: 59 AM
Slider వరంగల్

కలెక్టరేట్ ఎదుట చిన్న పిల్లలతో కలిసి ధర్నా

#mahaboobabad

ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏం చేయాలి? అందుకే చిన్న పిల్లలతో సహా ఒక కుటుంబం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట నేడు జరిగింది. భూ కబ్జాదారులు పై చర్యలు తీసుకోవాలి అని కుటుంబం మొత్తం కలెక్టర్ ఆఫీస్ ముందు బైఠాయించింది. చిన్నపిల్లలు కూడా కలిసి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. నెల్లికుదురుకు సంబంధించిన భూకబ్జాదారుడుపై చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నది.  కలెక్టర్ ఆఫీస్లు చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడంలేదని చిన్న పిల్లలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

గురుకుల పాఠశాల పిన్సిపల్ వార్డెన్ల తొలగింపు

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక సవాల్

Satyam NEWS

సంగారెడ్డి ల్యాండ్ పార్సెల్స్ ప్రి బిడ్ మీటింగ్ సక్సెస్

Satyam NEWS

Leave a Comment