ది. నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ గా ఇప్పటి వరకు సేవలందించిన డాక్టర్ అనితా రెడ్డి ప్రమోషన్ పై నేషనల్ జాయింట్ సెక్రటరీగా ఎంపిక కాబడ్డారు. ఇక నుండి నేషనల్ లెవల్ లో అనితా రెడ్డి వినియోగదారులకు సేవలందించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయి లో డాక్టర్ అనితా రెడ్డి అందించిన సేవలను గుర్తించి నేషనల్ లెవల్ పదవిని అందించామని ది. నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ మరియు నేషనల్ అడ్మిన్ చైర్మన్ రామానుజ స్వామి తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ నేషనల్ లెవల్ పదవి రావడం సంతోషంగా ఉందని ఇక నుండి నా సేవలను దేశ వ్యాప్తంగా విస్తరించే అవకాశం వచ్చిందని దీనితో బాద్యత మరింత పెరిగిందని తెలిపారు. మరింతగా అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని, వినియోగదారులు మోసపోకుండా చూడడమే లక్ష్యం గా పని చేస్తూ అవగాహన కార్యక్రమాలు విస్తరిస్తామని తెలిపారు. నేషనల్ జాయింట్ సెక్రటరీగా ఎంపిక చేసినందుకు ఫౌండర్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ కి కృతజ్ఞతలు తెలియచేసారు.