శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణానికి చెందిన ఒక ట్యూషన్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పలాస సమీపంలో రట్టి సముద్ర తీరానికి మంగళవారం పిక్నిక్ కు వెళ్లారు. అయితే సముద్రతీరంలో స్నానానికి దిగిన ముగ్గురు విద్యార్థులు సముద్రంలోకి కొట్టుకుపోయారు. ఈ ప్రమాదాన్ని గమనించిన మెరైన్ పోలీసులు బాలిక సప్ప మేఘన, బాలుడు దక్కత చందు లను కాపాడిగలిగారు. ఆశి జయరాం అనే బాలుడు మాత్రం సముద్రంలో గల్లంతయ్యారు. మెరైన్ సిబ్బంది ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో అత్యవసర వైద్యం కోసం 108 వాహనంలో శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి తరలించారు.
previous post