31.7 C
Hyderabad
May 2, 2024 09: 13 AM
Slider శ్రీకాకుళం

పలాస రట్టి సముద్ర తీరంలో పదో తరగతి విద్యార్థి గల్లంతు

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణానికి చెందిన ఒక ట్యూషన్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు పలాస సమీపంలో రట్టి సముద్ర తీరానికి మంగళవారం పిక్నిక్ కు వెళ్లారు. అయితే సముద్రతీరంలో స్నానానికి దిగిన ముగ్గురు విద్యార్థులు సముద్రంలోకి కొట్టుకుపోయారు. ఈ ప్రమాదాన్ని గమనించిన మెరైన్ పోలీసులు బాలిక సప్ప మేఘన, బాలుడు దక్కత చందు లను కాపాడిగలిగారు. ఆశి జయరాం అనే బాలుడు మాత్రం సముద్రంలో గల్లంతయ్యారు. మెరైన్ సిబ్బంది ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో అత్యవసర వైద్యం కోసం 108 వాహనంలో శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Related posts

మళ్ళీ పుట్టిన ‘మహా’ముసలం

Satyam NEWS

జగదీశ్వర్ గౌడ్ కు శుభాకాంక్షలు చెప్పిన కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

రేపు హుజూర్ నగర్ కు రానున్న వైఎస్ షర్మిల

Satyam NEWS

Leave a Comment