శ్రీకాకుళం నగరానికి చెందిన బిజెపి సీనియర్ నాయకుడు చల్లా వెంకటేశ్వర రావు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యునిగా నియమించబడ్డారు. 2014 లో బిజెపిలో చేరిన చల్లా వెంకటేశ్వర రావు పార్టీ పలు పదవులు సమర్ధవంతంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగర అధ్యక్షునిగా, శ్రీకాకుళం అసెంబ్లీ కన్వీనరుగా, జిల్లా మీడియా మరియు సోషల్ మీడియా కన్వీనరుగా, రాష్ట్ర ఇ-లైబ్రరీ కన్వీనరుగా పదవులు నిర్వహించారు. ప్రస్తుతం జిల్లా కాల్ సెంటర్ కన్వీనరుగా, నరేంద్రమోడీ యాప్ రాష్ట్ర కో-కన్వీనరుగా భాద్యతలు నిర్వహిస్తున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసారు.
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ కుటుంబానికి చెందిన చల్లా వెంకటేశ్వర రావు ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివారు. జిల్లా స్థాయి బిఎస్ఎన్ఎల్ ఫ్రాంఛైజీగా 20 సంవత్సరాలు సేవలు అందించారు. నెహ్రూ యువ కేంద్రం ద్వారా ఎంపిక అయ్యే నేషనల్ యూత్ వలంటీర్ల సెలక్షన్ కమిటీ సభ్యునిగా ఉన్నారు. ఈ పదవి కోసం జాతీయ పార్టీకి తన పేరు సూచించిన రాష్ట్ర పార్టీ పెద్దలకు, జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేళ్వర రావుకు, పార్టీలో తనకు సహకరిస్తున్న ప్రతి నాయకునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా చల్లా వెంకటేశ్వర రావు తెలిపారు.