కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. తనతో పాటు ఆయన భార్య జయసుధ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ అనంతరం నాగరాజు మీడియాతో మాట్లాడుతూ కర్నూలు లో టార్చ్ లైట్ వేసి వెతికిన అభివృద్ధి కనపడదని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు అభివృద్ధి కి కృషి చేస్తానని నాగరాజు తెలిపారు. తాను పార్లమెంట్ అభ్యర్థి గా విజయం సాధించిన తర్వాత కర్నూలు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. యువత కొరకు నూతనంగా పరిశ్రమలు స్థాపిస్తానన్నారు. జిల్లాలో వలసల నివారణ కొరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.
previous post