ప్రకాశం జిల్లా దర్శి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి దర్శి ప్రజలు అపూర్వ స్వాగతం లభించింది. ఊరూరా జనం నీరాజనాలు పట్టారు. దర్శి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గురువారం నియోజకవర్గానికి రావడంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కోటప్పకొండ త్రికోటేశ్వరుని స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకొని సింగరకొండలో పూజలు చేయించుకుని గొట్టిపాటి లక్ష్మి ముండ్లమూరు మండలం శంకరాపురం గ్రామంలో నియోజకవర్గంలో ప్రవేశించారు.
శంకరాపురం తో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల టిడిపి శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున లక్ష్మికి ఘన స్వాగతం పలికారు. గజమాలతో ఆమెను సత్కరించారు. పెద్ద ఎత్తున మహిళలు యువకులు గొట్టిపాటికి నీరాజనాలు పలికారు. గొట్టిపాటి రాక దర్శి అభివృద్ధికి బాటగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున గొట్టిపాటి లక్ష్మీ వాహన శ్రేణితో ర్యాలీ బయలుదేరింది. పులిపాడు, శంకరాపురం ముండ్లమూరు పశువుగల్లు ఉల్లగల్లు పెద్ద ఎత్తున గొట్టిపాటికి ఘన స్వాగతం లభించింది. మన దర్శి మన గొట్టిపాటి అంటూ నినాదాలతో ఓరెత్తించారు.
పెద్ద ఎత్తున పూలతో ప్రజలు స్వాగతం చెబుతూ అభివాదం చెప్పారు. దర్శి నియోజకవర్గంలో లక్ష్మి రాక పచ్చ తోరణాలతో ఒక పండుగ వాతావరణం వలె నిండిపోయింది. గొట్టిపాటి లక్ష్మీ తో పాటు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు బిజెపి నాయకులు పెద్ద ఎత్తున ఆమె స్వాగత ర్యాలీలో పాల్గొన్నారు.