22.7 C
Hyderabad
July 7, 2024 06: 59 AM
Slider ముఖ్యంశాలు

జగన్ విధ్వంసంపై ఎనిమిది శ్వేతపత్రాలు

#chandrababu

జగన్ రెడ్డి ఐదు సంవత్సరాల అరాచక పాలనలో జరిగిన విధ్వంసంపై ఒక అంచనాకు వచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయబోతున్నది. ప్రధానంగా ఎనిమిది శాఖలపై శ్వేత పత్రాలు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి మంత్రులతో కమిటీ వేసే ఆలోచనను సీఎం చేస్తున్నారు. కమిటీలో సభ్యులుగా మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, అనగాని సత్య ప్రసాద్ ఉంటారని తెలుస్తోంది. శ్వేత పత్రాల రూపకల్పనపై అధికారులతో మంత్రుల కమిటీ నిశితంగా చర్చించనున్నది. సోమవారం జరగనున్న కేబినెటి భేటీలో మంత్రుల కమిటీ వేసే అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Related posts

వచ్చే నెల 15 నుంచి సినిమా ధియేటర్లు ప్రారంభం

Satyam NEWS

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన బిచ్కుంద ఎంపీపి

Satyam NEWS

మతి స్థిమితం లేని ఈ మహిళను గుర్తుపట్టగలరా?

Satyam NEWS

Leave a Comment