నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో రైల్వే లైన్ నిర్మాణం కోసం 380.75 ఎకరాల భూమి సేకరించనున్నట్లు తహసీల్దారు ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఇందులో పట్టా భూమి 61.62, అసైన్డ్ 144, సీజేఎఫ్ఎస్ 36.45, ప్రభుత్వ భూమి 138 ఎకరాలు ఉందన్నారు. పట్టా భూముల రైతులు 161 మంది ఉండగా.. 39 మందికి ఇప్పటికే పరిహారం అందించినట్లు చెప్పారు. మిగిలిన వారికి త్వరలో నగదు అందజేస్తామని తెలిపారు.
previous post