కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని కాపు వాడ వద్ద షేక్ ఇంతియాజ్ కు చెందిన గోదాంలో నిలువ ఉంచిన రూ.6,88,400/- విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న కాగజ్నగర్ టౌన్ పోలీసులు.
టౌన్ ఇన్స్పెక్టర్ శంకరయ్య గారు తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం… స్తానిక కాపు వాడ చెందిన షేక్ ఇంతియాజ్ కు సంబంధించిన గోదాంలో అక్రమంగా నిలువ ఉంచిన 6,88,400/-/- విలువగల వివిధ రకాల గుట్కాలను స్వాధీనపర్చుకోవడం జరిగిందన్నారు. అట్టి బ్యాగులను పోలీస్ స్టేషన్ కు తరలించి షేక్ ఇంతియాజ్ పైన కేసు నమోదు చేసినట్టు టౌన్ ఇన్స్పెక్టర్ గారు వెల్లడించారు.
ఇట్టి దాడిలో టౌన్ ఇన్స్పెక్టర్ శంకరయ్య గారు మరియు ఎస్ఐ మహేందర్ గారు వారితో వారి సిబ్బంది తిరుపతి, విజయ్ సురేష్ రాజు, నాగరాజు పాల్గొనడం జరిగినది…