మావోయిస్టు అగ్రనేత ఆర్కే అలియాస్ రామకృష్ణ కోసం పోలీసులు మళ్లీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ సారి ఆపరేషన్ ఆర్కే పేరుతో ప్రత్యేకంగా గ్రూప్ ను ఎర్పాటు చేశారు. ఎలాగైనా ఆర్కే ను పట్టుకోవాలన్న లక్ష్యంతో పోలీసు బలగాలు ముందుకు పోతున్నాయి. ఇందులో భాగంగా తమకు వచ్చిన ప్రతి ఆవకాశాన్ని కూడా వినియోగించుకుంటున్నాయి. ఆంధ్రాలో తమ పట్టును పెంచుకునేందుకు మావోయిస్టు పార్టీని ప్రయత్నాలు చేస్తునే వుంది.
ఈ నేపధ్యంలో ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో అగ్రనేతలు ఎప్పటికప్పుడు వచ్చి మీటింగ్ లుపెట్టి నోతున్నారు. ఈ సమాచారం తెలుసుకుని పోలీసులు బలగాలు తమ కూంబింగ్ ను ముమ్మరం చేస్తున్నారు.ఆంధ్రా-ఒడిషా సరిహద్దులోమావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నట్లు సమాచారం ఉంది. ఇందులో ముఖ్యం గా మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ ర్ ఆర్కే ఒడిశాలోని మల్కన్గిరి చిత్రకొండ పరిసరాల్లో ఉన్నట్లు సమాచారం అదింది.
దీంతో ఒడిశా పోలీస్ యంత్రాంగం కూంబింగ్ మొదలుపెట్టింది. ఆర్కేతో పాటు మావోయిస్టు అగ్రనేతలు ఉదయ్, చలపతి కూడా ఇదే ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఆపరేషన్ ఆర్కే పేరుతో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఎస్వోజీ, డీబీఎఫ్లతో పాటు ఆంధ్ర గ్రేహౌండ్స్, తూ.గో పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.