ఇటీవల బళ్లారి నగర మేయర్ గా ఎన్నికైన ముల్లంగి నందీశ్ ను శుక్రవారం నాడు జియాలజిస్టు చల్లా అమరేంద్రనాథ్ చౌదరి ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులు సన్మానించారు. నందీ శ్ కు అమరేంద్రనాథ్ చౌదరి శాలువా కప్పి అభినందనలు తెలియజేశారు. లాండ్ లార్డ్ మదమంచి ఆంజనేయులు, చింబిలి ప్రసాద్, గోనుగుంట్ల రామ్మోహన్, గుర్రం రామ్ మోహన్, మహేష్ తదితరులు మేయర్ ను పుష్ప మాలాంకృతుడిని చేసి సన్మానించారు. యువకుడైన నందీశ్ నాయకత్వంలో బళ్లారి కర్ణాటకలోనే సుందర నగరంగా నిలవాలని వారు ఆకాంక్షించారు. 1966లో స్వర్గీయ ముల్లంగి దొడ్డబసప్ప గారు బళ్ళారి పురపాలక సంఘం అధ్యక్షుడు గా ఎన్నికై సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. దాదాపు 60 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఆయన తమ్ముని మనుమడు బళ్లారి మేయర్ గా ఎన్నిక కావడం విశేషం. నగర ప్రజలు మేయర్ ఎన్నికను స్వాగతించి అభినందిస్తున్నారు.
previous post