కర్నాటక లోని బగాళాగుంటే ప్రాంతం పీన్యాలో ఒక మహిళా కండక్టర్పై యాసిడ్ దాడి జరిగింది. బిఎంటిసి కండక్టర్ గా పని చేస్తున్న ఇందిరపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి అకస్మాత్తుగా యాసిడ్ తో దాడి చేశారు. ఇందిర భర్త బాలాజీ కూడా డ్రైవర్గా పని చేస్తున్నాడు. తుమకూరు ప్రాంతం శిర నుంచి పీన్యా బస్ లో వీరు ఇద్దరూ గత 17 సంవత్సరాలగా పని చేస్తున్నారు. నిన్న డ్యూటీకి వెళ్తుండగా ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి ఇందిర ముఖంపై యాసిడ్ పోసి వెళ్లిపోయారు.
స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ఆమె భర్త బాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు దుండగులు హెల్మెట్ ధరించి ఉన్నారని పోలీసులు చెప్పారు. సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. గత నాలుగు నెలల క్రితం ఇందిరను కారుతో ఢీకొట్టారు. అప్పుడు ఆమె చిన్నపాటి గాయాలతో బయటపడింది. అప్పుడు దాన్ని యాక్సిడెంట్ అనుకున్నారు.