ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఇన్నాళ్లూ సీఎంగా కొనసాగిన చంపయీ సోరెన్ బుధవారం తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో, చంపయీ నివాసంలో ఎమ్మెల్యేలు సమావేశమై హేమంత్ సోరెన్ ను తమ సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా గవర్నర్ సమ్మతి తెలిపారు. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ మూడోసారి పగ్గాలు చేపట్టారు.