గులాబీ కండువా కప్పి స్వాగతించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మండలం చీకటాయ పాలెం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు సల్పుగొండ ముత్తయ్య, వెంకట నర్సు, తండా యాకయ్య తదితర సీనియర్ నాయకులు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టీఆరెఎస్ లో చేరారు.
శుక్రవారం వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో సీఎం కెసీఆర్, నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై టీఆరెఎస్ లో చేరుతున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్తగా కాంగ్రెస్ నుంచి టీఆరెఎస్ లో చేరిన వాళ్లకు తగు గౌరవం, గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ, మండల టీఆరెఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.