పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం జోగిపాడు గ్రామంలో మణికంఠ శాశ్వత సన్నిధానం కొరకు 50,000/- వేల రూపాయలు విరాళంగా గత కొద్ది రోజుల క్రితం ఇవ్వడం జరిగింది. నిర్మాణ పనులు పూర్తి కావడంతో పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు చేతుల మీదుగా మణికంఠ శాశ్వత సన్నిధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవచింతనతోనే సంతృప్తి లభిస్తుందని దైవ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి సహాయం కావాలన్నా నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ ఎన్ పేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు యలమల గోవిందరావు, కొయిలాపు కృష్ణమాచార్య,ఆరుబోలు దశరథరావు, వాలిపల్లి వెంకటరమణ,పిండి రామారావు, వంబరవిల్లి ప్రతాప్, కోడూరు రామారావు, బిల్లింగి జీవరత్నం, మఠం రంగారావు,కాగితాపల్లి నంబిల్లా, లుకలాపు త్రినాధ్, మిరప బిల్లి తవిటి నాయుడు, బంటు రాములు, కరణం రవణమూర్తి, కుంచాల బాలకృష్ణ ,మక్కా రమణ, తదితరులు పాల్గొన్నారు.