వరంగల్ జిల్లాలో రహదారి మరోసారి నెత్తుటి మరకలు అంటించుకుంది. వర్ధన్నపేట మండలం డీసీ తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఓ లారీని కారు ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి. మృతుల్ని జిల్లాలోని వరంగల్ నగరం పెరుకవాడకు చెందిన బిల్డర్ కృష్ణారెడ్డి, ఆయన భార్య వరలక్ష్మి, కొడుకు వెంకటసాయి రెడ్డిగా గుర్తించారు. ఒంగోల్ నుండి వరంగల్ వస్తున్న క్రమంలో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది.గాయపడ్డ మిగిలిన ఆరుగురికి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.ఘటన జరిగిన సమయంలో కారులో మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసుల వెల్లడించారు.