హీరో రాజ్ తరుణ్ పై ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తాను గుడిలో పెళ్లి చేసుకున్నామని లావణ్య చెబుతున్నది. 11 ఏళ్లుగా రాజ్తరుణ్తో రిలేషన్షిప్లో ఉన్నానని కూడా లావణ్య చెబుతున్నది. వేరే హీరోయిన్తో అఫైర్ పెట్టుకొని తనను వదిలేశాడని ఆమె వెల్లడించింది. తన సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్తో అఫైర్ పెట్టుకొని తనను వదిలేశాడని, రాజ్ మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి తనకు దూరంగా ఉంటున్నాడని లావణ్య చెప్పింది. రాజ్ తరుణ్ ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని తనను బెదిరిస్తున్నారని ఆమె అంటున్నది. గతంలో తనను డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని. అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నా కూడా రాజ్ తనకు ఎలాంటి సాయం చేయలేదని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నది.
previous post