37.2 C
Hyderabad
April 30, 2024 13: 05 PM
Slider కృష్ణ

రాంగోపాల్ వర్మ కు సిగ్గు శరం ఏమాత్రం లేదు

#ramgopalvarma

రాంగోపాల్ వర్మ కు సిగ్గు శరం ఏమాత్రం లేదని కాపునాడు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు శ్రద్ధాంజలి అంటూ రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్లపై కాపు నాడు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ ప్యాకేజీల కోసం కాపులపై కామెంట్లు చేస్తే చెప్పు తీసుకుని కొడతామని హెచ్చరిక చేశారు. కాపులను రాజకీయ కారణాలు పేరు చెప్పి విభజించాలనే కుట్ర జరుగుతుంది. విద్వేషాలు రెచ్చగొట్టాలని వైసీపీ నేతలు వర్మ లాంటి ఊరకుక్కలను వదలుతున్నారు.

గత ఎన్నికలలో జగన్ కాపుల కోసం అనేక హామీలు ఇచ్చి మోసం చేశారు. కాపు జాతి గురించి ప్రేమ ఉంటే జగన్ ను నిలదీయి అంటూ కాపునాడు నేతలు అన్నారు. వైసీపీ లో ఉన్న కాపు నేతలు నోళ్లు అదుపులో పెట్టుకోవాలి. కాపు జాతి గురించి మాట్లాడే వారు కాపులకు ఏమైనా చేశారా…అంటూ వారు ప్రశ్నించారు. రాంగోపాల్ వర్మ కు సిగ్గు శరం ఏమాత్రం లేదు. జగన్ దగ్గర ప్యాకేజీ తీసుకుని వాగుతున్నాడు.

వర్మ నోరు అదుపులో పెట్టుకో.. కాపు జాతిని అవమానించడం దుర్మార్గం అంటూ కాపునాడు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వంగవీటి మోహన రంగా పై సినిమా తీసి డబ్బులు దండుకున్నావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటే.. నీకు తగిన బుద్ది చెప్పడం ఖాయం. పోస్టులు వెనక్కి తీసుకుని కాపు జాతికి రాంగోపాల్ వర్మ క్షమాపణ చెప్పాలి అంటూ వారు డిమాండ్ చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు పెట్టిన రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

స్థానిక సమస్య లపై బస్తీ బాట కార్యక్రమం

Satyam NEWS

ఒమిక్రాన్‌ తరహా మరో వైరస్‌ గుర్తింపు

Sub Editor

ప్రతి ధాన్యం గింజకూ గిట్టుబాటు ధర ఇస్తాం

Satyam NEWS

Leave a Comment