30.2 C
Hyderabad
July 7, 2024 16: 24 PM
Slider జాతీయం

మహానగరంగా అభివృద్ధి చెందబోతున్న అమరావతి

#meeting

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. అయితే అంత బిజీలోనూ అక్కడ ఉన్న తెలుగు ఐఏఎస్, ఐపీఎస్‌లకు విందు కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. వారితో ముచ్చటించి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ “గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది తెలుగు వారు న్యూఢిల్లీ, హైదరాబాద్‌లో సెటిల్ అవుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి, నివసించడానికి ఎక్కువ మంది అంతగా ఆసక్తి చూపలేదు.

అయితే మేము ఐటీరంగం అభివృద్ధికి పునాదులు వేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆ నగరానికి ఖ్యాతి వచ్చింది. ఎంతోమంది పెట్టుబడులు పెట్టారు. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అమరావతి విషయంలోనూ అదే జరుగుతుంది. ప్రస్తుతానికి రాజధాని అమరావతి నిర్మాణం పూర్తికాకున్నా, భవిష్యత్తులో మాత్రం మహానగరంగా ఎదుగుతుంది. పెట్టుబడులు, మానవ వనరులను ఆకర్షించేందుకు అన్ని చర్యలు చేపడతాం” అని చెప్పారు.

Related posts

హైదరాబాద్ వరద ప్రాంతాలలో అరుణ పర్యటన

Satyam NEWS

మూడోసారి అధికారంలోకి రావడానికి మళ్లీ బిఆర్ఎస్ మాయాజాలం

Satyam NEWS

దాసోజు శ్రవణ్ తో డాక్టర్ కేతూరి భేటీ

Satyam NEWS

Leave a Comment