హైదరాబాద్ మహానగరం వరదల్లో చిక్కుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం బాధితులను పరామర్శించడం కూడా చేయలేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డి.కే.అరుణ అన్నారు.
ఆమె నేడు చాదర్ ఘాట్ ప్రాంతంలోని వరద ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి వరద బాధితులను ఆమె పరామర్శించారు.
గ్రేటర్ ఎన్నికల్లో సీట్లు ఎలా గెలుచుకోవాలో సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు, మునిసిపల్ మంత్రి కేటీఆర్ ప్రణాళికలు వేస్తున్నారని అంతే తప్ప ప్రజల బాధలు పట్టించుకోవడం లేదని అరుణ అన్నారు.
చాదర్ ఘాట్, మలక్ పేట మూసీ ముంపు ప్రాంతాల్లోని బాధితులను అరుణ పర్యటించారు. ప్రభుత్వ వైఫల్యం తోనే వరద ముప్పు ఏర్పడిందని విమర్శించారు.