ఏఐసీసీ జాతీయ OBC కోఆర్డినేటర్ డాక్టర్ కేతూరి వెంకటేష్ తమిళనాడు ఇంచార్జ్ గా నియామకం అయ్యారు. ఈ సందర్బంగా ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ ఆయనను అభినందించారు. బంజారాహిల్స్ ఆఫీస్ లో వీరిద్దరి భేటీ జరిగింది.
ఈ సందర్బంగా వెంకటేష్ కు శుభాకాంక్షలు తెలుపుతూ దాసోజు శ్రవణ్ ఆయనను శాలువతో ఘనంగా సత్కారo చేశారు. ఈ సందర్బంగా దాసోజ్ శ్రవణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, ఓబీసీల రాజ్యాధికారం లక్ష్యంగా పని చేయాలని కోరారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలనీ పిలుపునిచ్చారు.