23.7 C
Hyderabad
July 8, 2024 08: 49 AM
Slider ప్రత్యేకం

కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం

#janareddy

తెలంగాణలో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మాజీ సి ఎల్ పీ నేత కుందూరు జానారెడ్డి తెలిపారు. మిర్యాలగూడ పట్టణ పరిధిలోని నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి క్యాంపు కార్యాలయంలో నేడు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ 3 నుంచి 5 లక్షల ఓట్ల మెజారిటీ తో గెలుస్తుందని అన్నారు. కేంద్రంలో ఇండియా కూటమిదే అధికారం అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ కోసం ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు,వామపక్షలకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలువబోతున్నట్లు ఆయన చెప్పారు.

Related posts

చింతమడకలో ఇంటికి 10 లక్షలు- మరి మాకో?

Satyam NEWS

హెల్ప్ ప్లీజ్: ఉల్లిపాయల క్యూ లైన్ మృతుడికి పరిహారం

Satyam NEWS

ఏపి మాజీ సిఎస్ ఎల్ వి సుబ్రహ్మణ్యానికి మహర్దశ

Satyam NEWS

Leave a Comment