సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాష్ట్రాన్ని టిఆర్ఎస్ నుంచి కాపాడాలని ఆయన కోరారు. తెలంగాణ వచ్చాక చేర్యాల అనాధగా మారిందని, పోరాటాల చరిత్ర ఉన్న చేర్యాలను టీఆర్ఎస్ అనామకంగా చేసిందని ఆయన అన్నారు.
చేర్యాల రెవిన్యూ డివిజన్ కోసం చేర్యాల ప్రజలు ఎంతో కొట్లాడినా ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. ముఖ్యమంత్రికి గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్ల తప్ప మిగతా ఏ ప్రాంతాలు గుర్తులేవని కోమటిరెడ్డి అన్నారు. జనగామ, చేర్యాల ప్రాంతాలను కేసీఆర్ మోసం చేస్తుండు..జనగామ ప్రాంతం కరువు ప్రాంతం.. చేర్యాల మున్సిపాలిటీ చేసినవు కానీ….అభివృద్ధి ఏది అని ఆయన ప్రశ్నించారు.
చింతమడకలో ఇంటికో 10లక్షలు ఇచ్చినవ్…పక్కనే ఉన్న చేర్యాల ప్రాంత వాసుల బాధలు నీకు గుర్తుకు రాలేదా అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. తండ్రి కొడుకులు 50 కోట్లు అక్రమ ఆస్తులు సంపాదించారని ఆయన అన్నారు.