అధికారులకు టీడీపీ నేత మేడా విజయశేఖర్ రెడ్డి హెచ్చరిక
అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట నియోజక వర్గంలో ఇంకా అధికారులు వైసిపి సేవలో తరిస్తున్నారన్నారు. అక్రమ లేఅవుట్లు,అక్రమ మట్టి తరలింపు యథేచ్ఛగా జరుగు తున్నాయని ఆరోపించారు. పోలీసులు కూడా వారికే వంత పాడుతున్నారని,రాజంపేట మునిసిపల్ కమిషనర్ ఇంకా జగన్ మోహన్ రెడ్డి ఫోటోతో పాలన చేస్తున్నారన్నారు. నియోజక వర్గంలో ఆక్రమిత భూ కబ్జాలపై త్వరలో ఆర్డీవో స్థాయి అధికారి తో విచారణ జరగనున్నట్లు తెలిపారు. అధికారులు పద్ధతి మార్చుకోక పోతే కార్యాలయాలు ముట్టడి చేస్తానమని హెచ్చరించారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.