40.2 C
Hyderabad
May 5, 2024 17: 20 PM
Slider హైదరాబాద్

వేకువ జామునే సీఎం స‌తీమ‌ణి, ఎమ్మెల్సీ, మంత్రి ఉత్త‌ర ద్వారా ద‌ర్శ‌నం

MLC1

వైకుంఠ ఏకాదశి సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెల‌గూడ‌లో మచ్చ వెంకటేశ్వరస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ స‌తీమ‌ణి శోభ, ఎమ్మెల్సీ కవితలు ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.
వీరికి ఆల‌యాధికారులు, ఎమ్మెల్యే, మంత్రి స‌బితా ఇంద్రారెడ్డిలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

శుక్ర‌వారం ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా వేకువజామున నాలుగు గంటలకే ఎమ్మెల్సీ క‌విత ఉత్త‌ర‌ద్వారాం ద్వారా స్వామివారిని దర్శించుకుకున్న‌ట్లు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించిన‌ట్లు కందూకూరు మండ‌ల టీఆర్ఎస్ ఉపాధ్య‌క్షులు సామ మ‌హేంద‌ర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఎమ్మెల్సీ క‌విత‌తో క‌లిసి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించరు. ప్ర‌త్యేక పూజానంతరం ఆలయ అర్చకులు వారికి ప్రసాదాలు, ఆశీర్వ‌చ‌నాలు అందజేసిన‌ట్లు సామ మ‌హేంద‌ర్‌రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిద్ధల లావణ్య బీరప్ప, ఆరకాల భూపాల్ రెడ్డి , మహేశ్వరం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు బండి మీనా నగేష్ యాదవ్, కార్పొరేటర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, ఆలయ కమిటీ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్న‌ట్లు సామ మ‌హేంద‌ర్‌రెడ్డి పేర్కొన్నారు.

Related posts

కరోనా కట్టడి కి వైద్యులతో రాజంపేట డీఎస్పీ భేటీ

Satyam NEWS

పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 షూటింగ్ పూర్తి

Satyam NEWS

అటల్ బిహారీ వాజ్ పేయికి చంద్రబాబు నివాళి

Satyam NEWS

Leave a Comment