22.7 C
Hyderabad
July 7, 2024 06: 08 AM
Slider తూర్పుగోదావరి

శ్రీ పురూహుతికా అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

#pavankalyan

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం పిఠాపురం ప్రముఖ శక్తిపీఠం శ్రీ పురూహుతికా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. పిఠాపురం, ఉప్పాడ బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన వారాహి సభకు ముందు శ్రీ పాద గయ క్షేత్రానికి విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ దుర్గా భవాని ఆధ్వర్యంలో అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మొదట విఘ్నేశ్వరుడిని, శ్రీపాద శ్రీవల్లభుడిని, శ్రీ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శక్తిస్వరూపిణి అయిన పురూహుతికా అమ్మవారికి పూజలు నిర్వహించారు. అర్చకులు అష్టోత్తర పూజానంతరం అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించి ఆశీర్వచనాలు అందచేశారు.

Related posts

ఇంటర్ విద్యార్ధులు అందరికీ ఓకే..?

Sub Editor 2

స్థానిక ఎన్నికల తర్వాత అసెంబ్లీ ముట్టడి

Satyam NEWS

మాస్క్ లేకుండా షాపు నడిపే యజమానికి భారీ జరిమానా

Satyam NEWS

Leave a Comment