30.7 C
Hyderabad
April 29, 2024 05: 12 AM
Slider కడప

స్థానిక ఎన్నికల తర్వాత అసెంబ్లీ ముట్టడి

CPI Ramakrishna

ఎన్నర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ బిల్లులు రద్దు అయ్యేంత వరకు వామపక్షాలు పోరాటాలు ఆగవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కడప లో శనివారం ఆయన మాట్లాడుతూ ఈ అంశాలపై స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అసెంబ్లీ ని ముట్టడిస్తామన్నారు. బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ లో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే ఇలా జరిగేది కాదని అన్నారు.

కొంత మంది వైసీపీ నాయకులు బిల్లు కు వ్యతిరేకం అని పాలాభిషేకం చేయించుకుంటున్నారు. నిజంగా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తే అసెంబ్లీ కి వెళ్లి వారికి ట్యాంకర్ ల తో పాలాభిషేకం చేస్తామని తెలిపారు. వైసీపీ ఇప్పటికైనా డ్రామాలు ఆపాలన్నారు.ని జంగా బిల్లుపై వైసీపీ, టీడీపీ స్పష్టత ఇవ్వాలి ఆయన డిమాండ్ చేశారు.

Related posts

హింసాత్మక చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు

Satyam NEWS

అర్హులైన వారు ఓటర్ గా నమోదు చేసుకోవాలి

Bhavani

లక్ష్యం మేరకు ప్రగతి సాధన జరగాలి

Murali Krishna

Leave a Comment