కరోన కాలంలో ఇబ్బందులు పడ్డ ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ప్రభుత్వం తీపికబురు అందించనున్నది . ప్రభుత్వ నిర్ణయంతో అనేక మంది విద్యార్ధులకు లాభం జరగనున్నది . కనీస మార్కులతో వుత్తీర్ణులైన వారిని కూడ ఎంసెట్ కు అర్హత కల్పించనున్నారు. సాధారణంగా ఇంటర్ లో కనీసం 40 మార్కులు వస్తేనే ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ కు అర్హత వస్తుంది . గత ఏడాది ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు చాలా తక్కువ శాతం వుత్తీర్ణత సాధించటం తో అందరిని పాస్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఐతే వారంతా ఇప్పుడు సెకండ్ ఇయర్ పరీక్షలకు సిద్దం అవుతున్న సమయంలో గత పరిస్తితులని ధృష్టి లో పెట్టుకొని సాధారణ మార్కులతో వుత్తీర్ణులైతే ఎంసెట్ కు అర్హత సాధించినట్లే నని తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్నది. దీనికి సంబందించి వున్నత విద్యామండలి త్వరలోనే వుత్తర్వులు జారీ చేయనున్నది .
next post