నరసరావుపేట రంగస్థలి 44వ వార్షికోత్సవం ఈ నెల 14వ తేదీన స్థానిక భువన చంద్ర టౌన్ హాల్ లో జరుగుతుందని అధ్యక్షుడు షేక్ మహబూబ్ సుభాని తెలిపారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలోని ఉన్నత పాఠాశాలలు, కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు ఏర్పాటు చేసిన నృత్య పోటీల కరపత్రాన్ని ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు నేడు ఆవిష్కరించారు. క్రమం తప్పకుండా 44 సంవత్సరాలుగా రంగస్థలి కార్యక్రమాలు జరుపుకోవటం మనందరికీ గర్వకారణం అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు కీలారు వెంకట రావు, అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని, ప్రధాన కార్యదర్శి నల్లపాటి బోస్, కోశాధికారి సూరిబాబు, మస్తాన్ రావు, ప్రసన్న కుమార్, శ్రీనివాసాచార్యులు, నారాయణ, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
previous post