బాగ్ అంబర్పేట్ డివిజన్ పాముల బస్తి లో జరుగుతున్న సిమెంట్ రోడ్డు పనుల వలన ఇండ్ల నుండి మెయిన్ లైన్ కు వెళ్లే డ్రైనేజీ పైప్ లైన్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని స్థానికులు డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డికి ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ పాడైపోయిన డ్రైనేజీ పైపులు వ్యక్తిగత డ్రైనేజీ ఇండ్లలో నుండి మెయిన్ లైన్ కు వెళ్లే పైప్ లైన్ వాటి మరమ్మతులు చేయాలని, అదేవిధంగా పాడైపోయిన డ్రైనేజీ మాన్యువల్స్ మరమ్మత్తులు చేసి అందులో పడిపోయిన మట్టిని తొలగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ బిజెపి మాజీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, డివిజన్ బిజెపి అధ్యక్షులు చుక్క జగన్, నాయకులు మిరియాల శ్రీనివాస్, బాలకృష్ణ గౌడ్ పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్