31.2 C
Hyderabad
July 4, 2024 15: 10 PM
Slider వరంగల్

కలెక్టరేట్ ఎదుట చిన్న పిల్లలతో కలిసి ధర్నా

#mahaboobabad

ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏం చేయాలి? అందుకే చిన్న పిల్లలతో సహా ఒక కుటుంబం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట నేడు జరిగింది. భూ కబ్జాదారులు పై చర్యలు తీసుకోవాలి అని కుటుంబం మొత్తం కలెక్టర్ ఆఫీస్ ముందు బైఠాయించింది. చిన్నపిల్లలు కూడా కలిసి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. నెల్లికుదురుకు సంబంధించిన భూకబ్జాదారుడుపై చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తున్నది.  కలెక్టర్ ఆఫీస్లు చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడంలేదని చిన్న పిల్లలు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

“దోస్తాన్” టీజర్ ను విడుదల చేసిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి

Bhavani

50 శాతం అదనపు ఛార్జీతో సంక్రాంతికి 1266 ప్రత్యేక బస్సులు

Satyam NEWS

విద్వేషం: స్వేరోస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు

Satyam NEWS

Leave a Comment