23.2 C
Hyderabad
May 7, 2024 20: 04 PM
Slider ప్రకాశం

పశ్చిమ ప్రకాశం పై టీడీపీ స్పెషల్ ఫోకస్

#TDP

తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని తటస్థులు, ఆయా వర్గాలకు చెందిన ప్రముఖులు, మేధావులతో మార్కాపురంలో ఈ నెల 10న సమావేశం కాబోతున్నారు. పెద్ద సంఖ్యలో ఆయా వర్గాల వారు హాజరయ్యే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సందర్భంగా బాబు పశ్చిమ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధికి సంబంధించి అలాగే మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి మరింత స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. బాబు వచ్చే రోజుకు మొత్తం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

అదే విధంగా 3వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పశ్చిమ ప్రకాశం నుంచే శంఖారావ సభలు ప్రారంభం కాబోతున్నాయి. అదే విధంగా మార్చి ఆఖరిలో లేదా ఏప్రిల్ మెుదట్లో దర్శి లేక పశ్చిమ ప్రకాశం కు జనసేనాని పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. యర్రగొండపాలెం టీడీపీ అభ్యర్ధిగా ఇప్పటికే గూడూరి ఎరిక్షన్ బాబు పేరు ప్రకటన చేశారు. గిద్దలూరు టీడీపీ అభ్యర్ధిగా ముత్తుముల అశోక్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల జరిగిన చంద్రబాబు సమీక్షలో జిల్లా అధిష్టానం కూడా అశోక్ రెడ్డి వైపే పూర్తి మెుగ్గు చూపారు.

Related posts

ఇష్టంతో కష్టపడి చదువుకోవాలి

Satyam NEWS

నర్సింగ్ కళాశాల పనులను వెంటనే పూర్తి చేయాలి

Satyam NEWS

మధ్యప్రదేశ్ రవాణా శాఖ అవినీతిపై నితిన్ గడ్కరీ సీరియస్

Satyam NEWS

Leave a Comment