సీఎం జగన్ మైనారిటీల ద్రోహి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ వ్యాఖ్యానించారు. మైనార్టీలకు వైసీపీలో సముచిత స్థానం దక్కడం లేదని ఆయన అన్నారు. అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు సేవలు రాష్ట్రానికి అవసరం అని ఆయన అన్నారు. ఫార్మేట్ లో ఎమ్మెల్సీకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన మండలి చైర్మన్ తో కూడా మాట్లాడారు. తన రాజీనామాను ఆయన ఆమోదించాలని కోరానని ఇక్బాల్ తెలిపారు. వైసిపిలో గౌరవం లేకపోవడంతో బయటికి వచ్చేసానని ఆయన స్పష్టం చేశారు.
అయితే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో మైనార్టీలకు ఒక్క పథకాన్ని కూడా అమలు చేయని పార్టీగా వైసిపి ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తా మైనార్టీలకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తా అని రిటైర్డ్ ఐజి, ఎమ్మెల్సీ ఇక్బాల్ తెలిపారు. మైనార్టీల ద్రోహి జగన్ అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలో వ్యవస్థలు నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్ అని ఆయన అన్నారు. బై జూస్ లో భారీ స్కాం జరిగిందని, లిక్కర్ మరో భారీ స్కాం అని ఆయన తెలిపారు.