కంబోడియా హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు విశాఖ చేరుకున్నారు. కంబోడియా సైబర్ నేరగాళ్ల నుండి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 25 మందికి విముక్తి కలిగింది. కంబోడియా బాధితులలో 9 మంది ఈరోజు సాయంత్రం విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. విశాఖ పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్ దర్యాప్తు ముమ్మరం చేసింది. హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో వివిధ జిల్లాలకు చెందిన 150 మంది చిక్కుకున్నారు. విశాఖవాసి ఒకరు సైబర్ నేరగాళ్ల చెరనుండి తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్ల చేతిలో 5 వేలమంది భారతీయులు చిక్కుకున్నారు. కంబోడియా నుండి విశాఖ వచ్చిన వారి కుటుంబ సభ్యులతో విశాఖ ఎయిర్పోర్టులో ఆనందాల వెల్లువ కనిపించింది.
previous post