31.2 C
Hyderabad
July 4, 2024 15: 52 PM
Slider చిత్తూరు

ఆనాడు అధికార మదం…. ఈనాడు వణికిపోతున్న వైనం

#peddireddy

జగన్ రెడ్డి అధికారంలో ఉండగా మంత్రి పదవి వెలగబెట్టిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అరాచక రాజకీయాలు అన్ని ఇన్నీ కావు. అధికారంలో ఉండగా రెచ్చిపోయి.. ఇప్పడు ప్రభుత్వం మారిపోవడంతో వణికిపోతున్నారు. మంత్రిగా పెద్దిరెడ్డి చేసిన స్కామ్‌లు, లొసుగులతో ఇప్పుడు సతమతం అవుతున్నారు. పైగా పోలీసులను చెప్పుచేతల్లో ఉంచుకొని వారిని అప్పట్లో టీడీపీ నేతలపైకి ఉసిగొల్పడం.. నానా తిప్పలు పెట్టించారు. చంద్రబాబుపైన పుంగనూరులో, ఆఖరికి కుప్పంలో కూడా రాళ్లు వేయించారు. 

దీంతో ఇప్పుడు తనకు ఏరకమైన కష్టం ఎటు నుంచి ఎదురవుతుందో అనుకుంటూ పెద్దిరెడ్డి బెంబేలెత్తిపోతున్నారు. పుంగనూరులో అడుగుపెట్టాలంటే చంద్రబాబుకైనా సరే వందల మంది సెక్యూరిటీ ఉండాలనేలా పెద్దిరెడ్డి రాజకీయం చేశారు. ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. తనకు సెక్యూరిటీ పెంచాలని ఏకంగా హైకోర్టుకు వెళ్లి పిటిషన్ వేశారు. తనకు ఫైవ్ ప్లస్ ఫైవ్ భద్రత ఉండేదని ఇప్పుడు తీసేశారని ఆయన కోర్టుకు చెప్పుకున్నారు. ప్రభుత్వమే తనకు సెక్యూరిటీ కల్పించాలని హైకోర్టును కోరారు.

అయితే, ఆయన కోరినంత మాత్రాన పెద్దిరెడ్డికి సెక్యూరిటీ వచ్చే పరిస్థితి లేదు. గతంలో మంత్రిగా పని చేసినందున ఆ సమయంలో పెద్దిరెడ్డికి ఫైవ్ ప్లస్ ఫైస్ సెక్యూరిటీని  కేటాయించారు. కానీ, ఇప్పుడు పెద్దిరెడ్డి కేవలం ఎమ్మెల్యే. గతంలో మంత్రిగా ఉండేవారు కాబట్టే జగన్ ప్రభుత్వ ఆ స్థాయి భద్రత ఇచ్చిందని.. ప్రభుత్వం తరపు లాయర్ హైకోర్టుకు వివరించారు. ఎవరికి ఎంత భద్రత ఇవ్వాలన్నదానిపై పోలీసు శాఖ సెక్యూరిటీ రివిజన్ చేసి నిర్ణయిస్తుందని.. అలాంటిది ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి ఇప్పుడు సెక్యూరిటీ గతంలో మాదిరిగా అవసరం లేదని వాదించారు.

ఇప్పుడు పెద్దిరెడ్డి కి అందర ఎమ్మెల్యేల తరహాలో వన్ ప్లస్ వన్ ఉంటుందని చెప్పారు. ఈ అంశంపై హైకోర్టు అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. నిజానికి పదవిలో ఉండగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవ్యంగా ఉండి ఉంటే.. సెక్యూరిటీ కోసం ఇంతగా తాపత్రయపడాల్సిన అవసరం లేదు. అసలు సెక్యూరిటీ అవసరమే ఉండేది కాదు. పుంగనూరులో వైసీపీ శ్రేణుల్ని, తన అనుచరుల్ని రౌడీలుగా టీడీపీ నేతలపైకి ఉసిగొల్పి రౌడీయిజాన్ని పెంచి పోషించారు.

ఇప్పుడు ఆ రౌడీలే తనపన తిరగబడతారని పెద్దిరెడ్డి వణికిపోతున్నారు. తమ రాజకీయ ప్రత్యర్థులపై అప్పట్లో నిర్దాక్షిణ్యంగా దాడులు చేయించి.. ఇప్పుడు తనపై ఎవరు దాడి చేస్తారో అని వణికిపోతూ పెద్దిరెడ్డి బతకాల్సి వస్తోంది.

Related posts

మతాలు వేరైనా భావాలు ఒక్కటే

Satyam NEWS

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి

Satyam NEWS

కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలేరు

Bhavani

Leave a Comment