అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అంబర్ పేట అలీ కేఫ్ చౌరస్తాలోని ఎస్ఆర్జీ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని అంబర్ పేట నియోజకవర్గంలోని 79 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,00,116/- చొప్పున మొత్తం 79,09,164 /- రూపాయల కళ్యాణలక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకమే కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ అని తెలియజేశారు.
శనివారం ఎంతోమంది నిరుపేదలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని, పేదింటి పెండ్లికి బీఆర్ఎస్ ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో లలిత, ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట్