32.2 C
Hyderabad
July 2, 2024 17: 53 PM
Slider ఖమ్మం

సీతారామ ప్రాజెక్ట్ పూర్తికి అన్ని చర్యలు

#seetaramaproject

సీతారామ ప్రాజెక్ట్ క్షేత్ర పరిశీలనను మంత్రుల బృందం చేపట్టింది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర నీటిపారుదల, ఆహారం పౌరసరఫరాల శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మవారి పల్లి గ్రామంలోని సీతారామ ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటరీ వద్దకు హెలిక్యాప్టర్లో చేరుకుని సీతారామ ప్రాజెక్టు వ్యూ పాయింట్ సందర్శించి, ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు.

వ్యూ పాయింట్ వద్ద సాగునీటి అధికారులు ఏర్పాటుచేసిన సీతారామ ప్రాజెక్ట్ ఫోటో ప్రజెంటేషన్ ను మంత్రుల బృందం తిలకించింది. ఇప్పటివరకు పూర్తయిన సీతారామ ప్రాజెక్టు పనుల వివరాలను డిప్యూటీ సీఎం, మంత్రులకు సాగునీటి పారుదల శాఖ అధికారులు వివరించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంప్ హౌజ్ -1 వద్దకు చేరుకుని పంప్ హౌస్ పనులను పరిశీలించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌజ్ -1 కంట్రోల్ రూమ్ లో పవర్ సప్లై ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి ప్రారంభించారు.

అనంతరం సీతారామసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వి.కే. రామారం గ్రామం వద్ద ఉన్న పంప్ హౌజ్- 2 పనులను మంత్రుల బృందం పరిశీలించింది. అక్కడి నుండి అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం పూసగూడెం గ్రామంలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌజ్ -3 ని సందర్శించి పనులను పరిశీలించారు. కెనాల్ వెంట 63 కిలోమీటర్లు ప్రయాణం చేసిన మంత్రుల బృందం 6 గంటల పాటు సీతారామ ప్రాజెక్టు పనుల పరిశీలించింది.  పనుల పరిశీలన అనంతరం ఉపముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్టు పనులు, కొనసాగుతున్న కెనాల్స్ పనులు, భూ సేకరణ, ప్రాజెక్టు పూర్తి కావడానికి కావలసిన నిధులు, ఎదురవుతున్న సమస్యలను ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు మంత్రులకు వివరించారు. సమీక్ష లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నాటికి ఎన్కూరు లింకు కెనాల్ ను పూర్తి చేసి లక్షా ఇరవై వేల ఎకరాలకు గోదావరి నీళ్లను అందిస్తుందని తెలిపారు.  కేవలం రూ. 2654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి 20 వేల కోట్ల రూపాయలకు  గత ప్రభుత్వంలో పెంచారన్నారు.

దశాబ్ద పాలనలో సీతారామ ప్రాజెక్టుపై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం ఒక్క ఎకరానికి కూడా తాగునీరు ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలు చేశామన్నారు.  సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమీక్షంచమన్నారు. సీతారామ ప్రాజెక్టు కు ఎన్ఎస్పిఎల్ కెనాల్ కు లింకు చేయడానికి 9 కిలోమీటర్లు ఉన్న ఎన్కూర్ లింక్ కెనాల్ ను పూర్తి చేయడానికి 72 కోట్లు రూపాయలు మంజూరి చేశామన్నారు.

ఎన్నికల కోడ్ ముందు ఈ పనులను సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వైరాకు వచ్చి శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా పంప్స్ ట్రయల్ రన్ చేయడానికి కావలసిన పవర్ సప్లై కోసం నిధులు ఇచ్చామన్నారు. పంప్స్ ట్రయల్ రన్ ప్రాసెసింగ్ కొనసాగుతుందని చెప్పారు. ఎన్కూర్ లింకు కెనాల్ ను రాజీవ్ కెనాల్ గా నామకరణం చేస్తున్నట్టు వెల్లడించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌజ్ 1, 2, 3 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ పనులు తొందరలోనే మొదలు పెడతామని వెల్లడించారు.

సమీక్ష లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ,  కాలేశ్వరం ప్రాజెక్టుకు 90400 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కేవలం 93000 ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే సాగులోకి తీసుకువచ్చిందని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 27 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గత ప్రభుత్వం ఒక ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 9000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఒక ఎకరం కొత్త ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం మొదలుపెట్టిన ఏ సాగునీటి ప్రాజెక్టులను 10 సంవత్సరాల పాలనలో పూర్తి చేయలేదని అన్నారు.

తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సాగునీరు ఇవ్వడానికి ఇరిగేషన్ శాఖ ప్రణాళికను తయారు చేసుకొని ముందుకు పోతున్నదని వివరించారు. 2000 కోట్లతో పూర్తయి రాజీవ్ సాగర్ ను సరైన కారణం లేకుండా రీ డిజైన్ చేసి 20 వేల కోట్ల రూపాయలకు గత ప్రభుత్వం పెంచడం వెనుక ఆంతర్యం ఏంటో ప్రజలకు అర్థం చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం గోదావరి నది జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చి సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.

రీడిజన్ పేరిట తప్పుడు నిర్ణయం తీసుకొని రాష్ట్రానికి హార్దిక భారం మోపినప్పటికీ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీతారామ ప్రాజెక్టు పూర్తి కావడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర పర్యావరణ శాఖలో ఉన్న స్త్రీలను తొలగించి పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ మరమ్మత్తులను యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు రైతులకు మేలు జరిగే విధంగా భారీ మధ్య చిన్న తరహా సాగునీటి పెండింగ్ ప్రాజెక్టును ఖమ్మం జిల్లాలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, 1997- 98 లో దుమ్ముగూడెం ప్రాజెక్టు పేరున ప్రారంభమై, రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇందిరా రాజీవ్ ప్రాజెక్టుగా మారి, ఇప్పుడు సీతారామ ప్రాజెక్టుగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 400 కోట్లతో ప్రారంభించిన పనులను బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు రీ డిజైన్ చేసి ఖర్చును 20 వేల కోట్లకు  పెంచిందని, కానీ  పనులు పూర్తి చేయలేదని అన్నారు. ఇప్పటివరకు ఒక ఎకరానికి కూడా నీరు అందజేయలేదన్నారు. నేటి వరకు 9,000 కోట్ల పని పూర్తయిందని, సాంకేతిక పరంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు.

కొత్తగూడెం నియోజకవర్గానికి కొత్త ఆయకట్టు పెరిగేలా కృషి చేస్తామన్నారు. రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆలోచన లేకుండా ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన పనులు పూర్తి చేయకుండా నిధులు ఖర్చు చేయడంతో పరిస్థితి బూడిదలో పోసిన పన్నీరులా మారిందన్నారు. గోదావరి నీళ్లతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,20,000 ఎకరాల ఆయకట్టు, నాగార్జునసాగర్ కాల్వ కింద నీరు అందేలా ప్రయత్నిస్తామన్నారు.

ఉమ్మడి జిల్లా రైతులకు న్యాయం చేసేందుకే నలుగురం మంత్రులం  వచ్చామన్నారు. ప్రణాళిక బద్ధంగా పనిచేసి ఆగస్టు 15 కల్లా జిల్లాలోని రైతులకు సీతారామ ప్రాజెక్టు ద్వారా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ సిబ్బందిని మంత్రి ఆదేశించారు. కొత్తగూడెం,ఇల్లందు, పినపాక నియోజకవర్గాల రైతులకు ఆయకట్టు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు రామసహాయం రఘురాం రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్యే లు పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ నాయక్, కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్ రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్,  ఇర్రిగేషన్ సిఇ శ్రీనివాస రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పంచాయితీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేసిన నిమ్మగడ్డ

Satyam NEWS

మాతృమూర్తికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించిన జిల్లా కలెక్టర్

Satyam NEWS

Analysis: బలం లేని చోట్ల కూడా గేమ్ మొదలెట్టిన బిజెపి

Satyam NEWS

Leave a Comment