డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం పాత బస్టాండ్ నుంచి చింతకాని మండలం జగన్నాధపురం వరకు పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో టికెట్ కొని సామాన్యుడిగా ప్రయాణం చేసిన విషయం ఆసక్తికరంగా మారింది. బస్సులో ప్రయాణిస్తున్న ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మహాలక్ష్మి పథకం అమలవుతున్న వివరాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్, జిల్లా కలెక్టర్ గౌతమ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
previous post
next post