ఒక విషాదం తట్టుకోవడమే కష్టం. అలాంటిది అతి స్వల్ప వ్యవధిలో ఒకే ఇంట్లో రెండు సహజ మరణాలు సంభవిస్తే…. ఆ విషాదం ములుగు జిల్లా మంగపేటలో చోటు చేసుకున్నది. మండల కేంద్రం పొదమురుకు చెందిన పల్నాటి నర్సయ్య తల్లి లక్మి(90) అనారోగ్యం తో ఈ రోజు ఉదయం 5 గంటలకు మృతి చెందింది.
అత్తగారి మృతి విషయం తెలుసుకున్న నర్సయ్య భార్య మంజుల(45) ఆమె దగ్గరకు వెళ్లి చూస్తూనే గిందేపాటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందింది. 10 నిమిషాల సమయంలోనే ఒకే ఇంట్లో రెండు మరణాలు చోటు చేసుకోవడం తో ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.