ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబునాయుడు రేపు సాయంత్రం సచీవాలయంలో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సాయంత్రం 4.41కి ఆయన సచివాలయంలోని తన ఛాంబర్ లోకి ప్రవేశిస్తారు. తన ఛాంబర్ లో అడుగు పెట్టిన తర్వాత ఆయన అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం పెట్టబోతున్నారు. అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం పెడతారు. అలాగే పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం చేస్తారు. ఇక నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై ఉంటుంది. ఐదో సంతకం విషయానికి వస్తే స్కిల్ సెన్సెస్పై ఉంటుంది.
previous post
next post