40.2 C
Hyderabad
April 26, 2024 11: 21 AM
Slider విజయనగరం

త‌ర‌లిపోతున్న గో సంప‌ద‌…ఒక్క రోజులో వంద ఆవుల అక్ర‌మ త‌ర‌లింపు…?

#CowSlaughter

త‌ర‌లిపోతున్న గో సంప‌ద‌…ఒక్క రోజులో వంద ఆవుల అక్ర‌మ త‌ర‌లింపు…? దేశానికి వెన్నుముక రైతు అయితే…అదే  దేశానికి సిరి సంప‌ద ఆవు.ఆవును గోమాత‌గా భావించే ఈ భార‌త‌దేశంలో  ఆ ఆవుపేడ‌తో ఏకంగా ఔష‌ధాలు త‌యారు చేస్తున్నాము.కాని ప్ర‌స్తుతం కొన్ని రాష్ట్రాల‌లో ఏకంగా ఆవులను క‌బేళాల‌కు త‌ర‌లించి…వాటికి నిర్దాక్షిణ్యంగా చంపి..వాటి మాంసాన్ని విదేశాల‌కు ఎగుమ‌తి చేసే మాఫియా ఇటీవ‌లే త‌యారైందని కొన్ని సంఘాలు గొంతెత్తి ఘోషిస్తున్నాయి.

తాజాగా ఏపీలోని ఉత్త‌రాంద్ర‌లోని సిక్కోలు జిల్లా  నుంచీ  దాదాపు వంద ఆవులు అక్ర‌మంగా కొంద‌రు ర‌వాణా చేసుకు వెళ్ల‌డాన్ని గుర్తించారు..కొంద‌రు. త‌క్షణం స‌మాచారం అందుకున్న కొంద‌రు వ్య‌క్తులు…రెండు లారీల‌లో 93 ఆవులు అక్ర‌మంగా తీసుకు వెళుతుండ‌టాన్ని గుర్తించి…భోగాపురం పోలీసులకు అప్ప‌గించారు.

లారీల‌లో త‌ర‌లివెళుతున్న ఆవుల‌ను..ఫిర్యాదు చేసిన వ్య‌క్తి స‌మాచారం మేర‌కు భోగాపురం ఎస్ఐ మ‌హేష్…ఆ రెండు లారీల‌ను సీజ్ చేసారు.సీన్ క‌ట్ చేస్తే..ఆ ఆవుల‌ను ఏం చేసార‌ని…సద‌రు ఫిర్యాదు చేసిన వ్య‌క్తి  భోగాపురం ఎస్ఐని  వెళ్లి అడిగితే…మీరు ఫిర్యాదు చేసారుగ‌..ఇంక మేము చూసుకుంటాం వెళ్లండని స‌మాధానం ఇచ్చారు.

ఇదే విష‌యంపై  మీడియాకు స‌మాచారం అంద‌డంతో…విజ‌య‌న‌గ‌రం డీఎస్పీ అనిల్ ను వివ‌ర‌ణ కోరారు. తమ దృష్టికి వ‌చ్చిందని… అయినా పూస‌పాటిరేగ పీఎస్ లో కూడా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింద‌ని ఆవుల అక్ర‌మ త‌రలింపుపై  త‌మ శాఖ ప‌రగా చ‌ట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.

Related posts

‘మనం సైతం’ కాదంబరి కీర్తి కిరీటంలో గౌరవ డాక్టరేట్

Satyam NEWS

మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌లో వామ ప‌క్ష పార్టీల పోటీ

Satyam NEWS

లేడీ బాస్: ప‌నితీరుతో సిబ్బందికి వ‌ణుకు పుట్టిస్తున్న విజయనగరం ఎస్పీ

Satyam NEWS

Leave a Comment