పల్నాడు జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదని గుంటూరు రేంజి ఐజి సర్వ శ్రేష్ట త్రిపాటి కి నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు భరోసాని ఇచ్చారు. ఈ మేరకు ఐజిని మర్యాదపూర్వకంగా వారి కార్యాలయంలో కలిశారు. పుష్పగుచ్చం అందజేసి, దుశ్శాలువతో సత్కరించారు.
రాష్ట్రంలో అత్యంత సమశ్యాత్మక ప్రాంతాల్లో నరసరావుపేట జిల్లా అగ్రస్థానంలో అత్యంత బాధాకరం అన్నారు.జిల్లాలో ప్రజలకు జీవించే హక్కు కల్పించాల్సిన బాధ్యత మన అందరి పై ఉందన్నారు.గతంలో ప్రశ్నిస్తే కేసు, నిలదీస్తే దాడి,ఎదురిస్తే హత్య అనే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.నియోజకవర్గంలో ఇక పై శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ ఒక్కరిని ఉపేక్షించొద్దని విన్నవించారు.
మనకు ప్రజలు ప్రజా సమస్యలు వారి సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా పని చేయాలని సూచించారు. దాడులు చేయడం,హత్యలు చేయడం తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదు అన్నారు.చట్టపరంగా తప్పు చేసిన ఏ ఒక్కరు చట్టం నుంచి తప్పించుకోరు అనే పరిస్థితిని నియోజకవర్గంలో సృష్టించాలని కోరారు.ప్రజా సమస్యల పట్ల,రాజ్యాంగ పరిరక్షణ కోసం అనునిత్యం పోలీస్ సిబ్బందికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు ఐజికి హామీ ఇచ్చారు.
ఎమ్ ఎస్ సుధాకర్, సత్యం న్యూస్, పల్నాడు జిల్లా