తెలుగుదేశం నాయకులపై అక్రమ కేసులు బనాయించడం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని, తెలుగుదేశం నాయకులను ఇబ్బంది పెట్టకపోతే నిద్ర రావడంలేదని రాయచోటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
గతంలో నాపై కూడా 307 కేసు నమోదు చేశారని, ప్రస్తుతం రమేశ్ కుమార్ రెడ్డిపై కూడా అక్రమ కేసులు బనాయించారని, వైసిపి ప్రభుత్వం బనాయిసున్న ఇలాంటి అక్రమ కేసులకు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష నేతలపై చేపడుతున్న కవ్వింపు చర్యలకు భయపడేది లేదని, ఇలాంటి కేసులతో మరింత ఉత్సాహంతో ప్రజా సమస్యలపై పోరాడుతామని హెచ్చరించారు.
2019 తరువాత వైసీపీ ప్రభుత్వం చేతకాని పాలనతో ప్రజలు విసిగి, వేసారి పోయారని, తెలుగుదేశం పార్టీకి ప్రజలలో పెరుగుతున్న ఆదరణను చూససి జీర్ణయిచ్చుకోలేని వైయస్సార్ సిపి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి, వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే తెలుగుదేశం పార్టీ నాయకులను, సామాన్య ప్రజలను అరెస్ట్ చేసి భయబ్రాంతులు చేయడం నిత్య కార్యాచరణగా మారిందని, వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న దుశ్చర్యలను రాష్ట్ర ప్రజలందరూ గమణిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు దగ్గరపడ్డాయని మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.