ఒకానోక సమయంలో అయోద్య లో కరసేవల వ్యూహాత్మక చర్యలో ఓ దేశభక్తుడిగా ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కరీంనగర్ కు చెందిన నాటి సంజయ్…ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉంటున్నారు. అదీగాక కరీంనగర్ ఎంపీ గా ఉంటున్న బండి సంజయ్ కుమార్…రానున్న అసెంబ్లీ ఎన్నిలలో గోల్కొండ కోట పై కాషాయ జెండ రెపరెపలాడించాలనే లక్ష్యంతో ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు.
వాస్తవానికి గత వారమే ఈయాత్ర ప్రారంభించాలనుకున్నప్పటికీ యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మృతితో వాయిదా పడింది. అనంతరం 28 తేదీన ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెడతానని అనుకున్న ప్రకారమే ఈ యాత్ర ప్రారంభమైంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ హైదరాబాదా లోని బంజారాహిల్స్ నుంచీ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ,దీనదయాల్ జీ ,భరత మాత ఫోటోలకు దండ వేసి నమస్కరించారు.
అంతకుముందే వేములవాడ రాజన్న ఆలయపూజారుల ఆశీస్సులు పొందిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. పార్టీ సీనియర్ నేతలతో కలిసి చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్లారు. అక్కడే అమ్మవారికి పూజలు చేసిన హైదరాబాద్ నగర ప్రజలతో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల నుద్దేశించి తానెందుకు ఈ ప్రజా సంగ్రాయ మాత్రం చేపడుతున్నానో వివరించనున్నారు.అదే విధంగా కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ,పార్టీ జాతీయకార్యదర్శి మురళీ ధర్ రెడ్డి,డా.కే.లక్ష్మణ్ లు కూడా హాజరుకానున్నారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్