నల్లగొండ, వరంగల్లు, ఖమ్మం నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాంకు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు సి.పి.ఐ(యం.ఎల్) న్యూడెమోక్రసీ ఒక ప్రకటనలో తెలిపారు.
పట్టభద్రుల ఓటర్లు అందరూ రాష్ట్రంలో ప్రజల, ప్రజాస్వామిక ఉద్యమాల ప్రయోజనాలను ముందుకు తీసుకుపోవటానికి ప్రొఫెసర్ కోదండరాం కు తమ పూర్తి మద్దతు తెలిపి గెలిపించ వలసిందిగా సి.పి.ఐ (యం.ఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి డి.వి.కృష్ణ, రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి పోటు రంగారావు కోరారు.