అడ్డగోలుగా బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టే చర్యలకు పాల్పడిన వైసీపీ నాయకుల గురించి ఇప్పటికే మనకు తెలుసు. ఆ కోవలోకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేరారు. ఎప్పుడో 2008 చేసిన పనుల బిల్లును మంజూరు చేయించుకునేందుకు ఆదాల ప్రభాకర్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎలాగో అధికారులను మభ్యపెట్టి డబ్బులు కొట్టేద్దాం అనుకుని ఆయన వేసిన ప్లాన్ కు ఆఖరు నిమిషంలో ఎదుదెబ్బ తగిలింది. రూ. 67 కోట్ల బిల్లును ఉన్నతాధికారులు నిలిపివేశారు. ఎన్నికల సమయంలో ఈ బిల్లులు చెల్లిస్తేనే తాను నెల్లూరు రూరల్ కు పోటీ చేస్తానని ఆదాల జగన్ కు షరతు విధించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో 67 కోట్ల బిల్లు చెల్లింపులను వెంటనే నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. దాంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గేమ్ కు చెక్ పెట్టినట్లు అయింది.
previous post