ఈ ఫొటోలు వీడియోలు చూసి మీరు బీహార్ లో జరిగింది అనుకోవచ్చు. కానీ కాదు. బీహార్ రాష్ట్రంలో పల్లెల్లో రౌడీలు, సంఘ విద్రోహ శక్తులు కత్తులతో స్వైర విహారం చేస్తుంటారని విన్నాం…. చూశాం…
అయితే ఇప్పుడు ఆ రాష్ట్రం పరిస్థితి మారింది. బీహార్ లో ఇప్పుడు కత్తుల స్వైరవిహారం కనిపించడం లేదు. ఆ లోటు ఎలా తీర్చాలి? ఎవరు తీర్చాలి? అనేదానికి సమాధానం దొరికింది.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం లో ‘‘బీహార్ టైప్’’ కత్తుల స్వైర విహారం జరిగింది.
విషయం ఏమిటంటే అక్కడ నిన్న రాత్రి వైఎస్ఆర్ పార్టీ నాయకుడి పుట్టిన రోజు జరిగింది. శాంతి భద్రతలకు ఆలవాలమైన తూర్పుగోదావరి జిల్లాలో వెరైటీగా ఉండాలని కాబోలు కత్తులతో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.
ప్రదాన రహదారి పోలీస్ స్టేషన్ ఎదురుగా మాజీ కౌన్సిలర్ కుమారుడు వైసీపీ అభిమాని యలమిళ్లి దుర్గాప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్టింగ్ హంగామా జరిగింది.
అదీ కూడా అర్ధరాత్రి జరిగింది. రోడ్లపైన కత్తులతో హల్చల్ చల్ చేయడంతో ముమ్మిడివరం ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.