22.7 C
Hyderabad
July 3, 2024 03: 27 AM
Slider ముఖ్యంశాలు

పోలీసుల సహకారంతోనే ఎమ్మెల్యే పిన్నెల్లి పరార్

#varlaramaiah

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నుంచి పారిపోవడానికి పోలీసులే సహకరించారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి పలు అంశాలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ..13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే పిన్నెల్లి  రామకృష్ణారెడ్డి అక్రమంగా పోలింగ్ బూత్ లోకి చొరబడి  ఈవీఎం పగలగొడితే పి.ఓ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?  గుర్తు తెలియని వ్యక్తి ఈవీఎం ధ్వంసం చేశాడని విఆర్ఓ చేత ఫిర్యాదు చేయించడం ఏంటి ? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? వెబ్ కాస్టింగ్ పెట్టామన్నారు ఏం చేశారు, ఎమ్మెల్యే  ఈవీఎం పగలగొట్టి బయటికి వెళ్తుంటే బూతు వద్ద బందోబస్తులో ఉన్న కానిస్టేబుళ్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు?

మాచర్ల నియోజకవర్గానికి కేంద్ర బలగాలు వెళ్లాయి, కానీ పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో కేంద్ర బలగాలను ఎందుకు నియమించలేదు?  అక్కడ కావాలనే సెంట్రల్ బలగాలు నియమించలేదా? ఈవీఎం బాక్స్ పగలగొట్టినా రిపోర్టు ఇవ్వడానికి రెండు రోజులు ఎందుకు సమయం పట్టింది, ఎందుకు రిపోర్టు చేయలేదు, ఈసీ ఎందుకు విచారణ చేయలేదు? దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉంది,  ఈ పరిస్థితి చూస్తుంటే ఓట్ల లెక్కింపు సజావుగా జరుగుతుందన్న నమ్మకం లేదు.  పిన్నెల్లి మాచర్ల నుంచి పారిపోవడానికి కారణం పోలీసులే.

ఈవీఎం ధ్వంసం చేశాక అరెస్టు చేయకుండా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి ? హౌస్ అరెస్ట్ లో ఉన్న వ్యక్తి ఎలా పారిపోతాడు, దీనికి ఎవరు సహకరించారు ఎస్పినా,డి ఐజినా, ఇదంతా ఈసీకి తెలియకుండా జరిగిందా? ఇప్పటికైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. కౌంటింగ్ చేయడానికి 500 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకి ఒక టేబుల్ ఉండాలని, స్టాంపులు సంతకాలు లేని పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈసినీ కోరామని వర్ల తెలిపారు.

మరో వైపు మంత్రి కాకాణి గోవర్డన్ రెడ్డి టీడీపీ కార్యకర్తల్ని కౌంటింగ్ అవ్వగానే మీ సంగతి అ చూస్తానంటూ.. బెదిరిస్తున్నాడు. అతనిపై చర్యలు తీసుకోవాలి,  బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో కాకాని కారు దొరికింది ఇంకా సిగ్గులేకుండా తనది కాదంటూ బుకాయిస్తున్నాడు.అన్ని అక్రమాలు చేసి నాకేం తెలియదు అంటూ బుకాయిచడం కాకానికి అలవాటే.  దీనిపై కేసు నమోదు చేసి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలా గోవర్ధన్ రెడ్డి లేచిపోక ముందే అరెస్టు చేయాలి అని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈసీని కలిసిన వారిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ నేతలు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మన్నవ సుబ్బారావు తదితరులు ఉన్నారు.

Related posts

అణగారిన వర్గాలకు టీడీపీ అండగా ఉంటుంది

Satyam NEWS

మరో మోసం: ఇంటి స్థలాలు ఇవ్వకుండానే నగదు మంజూరైనట్లు పత్రాలు

Bhavani

రాచపూడి కరుణాదేవికి కెమిస్ట్రీలో డాక్టరేట్

Satyam NEWS

Leave a Comment